Tuesday, 30 December 2014

Air Asia Flight Found In Sea

Air Asia Flight Found In Sea

Air Asia Flight Found In Sea Official Statement Has Given Some Dead Bodies Also Collected - ITEMVIDEO

A day after it disappeared en route from east Java in Indonesia to Singapore, mystery surrounds the fate of AirAsia flight QZ8501 and the 162 people on board that flight found in sea

 

ITEMVIDEO: ఉత్కంట వీడింది.... విషాదం మిగిలింది

Air asia flight found in sea official statement has given some dead bodies also collected

గత మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమాన సంఘటన విషాదాంతంతో ముగిసింది. సముద్ర ఉపరితలంపై కొన్ని శకలాలు కనిపించిన కొద్ది సేపటికే ఎయిర్ ఏషియా విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా అధికారులు తెలిపారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. ఈ విషయం తెలియగానే ప్రయాణికుల బంధువుల ఆశల సౌధాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. తమ వారు ఎక్కడో చోట క్షేమంగానే ఉంటారని, తిరిగోస్తారని ఎదురుచూసిన ప్రయాణికుల బంధువులకు తీరని ఆవేదనను మిగిల్చింది.





విమానం రాడార్ పరిధినుంచి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను తొలుత గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయగా కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి. దాంతో విమానం సముద్రంలోనే కూలిపోయిందని స్పష్టంగా తెలిసింది. ఇక ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. ఇంకా అక్కడ ఆ ప్రాంతం లో గాలింపు చర్యలు మమరం చేశారు. ఆ విమానం సముద్ర గర్భానికి వెళ్ళిపోయిందా లేదా కొందరు ప్రయాణికులు విమానంలో నుండి దూకార అన్నది నిర్దారణ కావాల్సి ఉంది. ఒకవేళ విమానం సముద్ర గర్భంలోకి మునిగిపోయి ఉంటె ఆ విమానాన్ని తీసే సాంకేతిక పరిజ్ఞానం కానీ, సామగ్రి కానీ ఇండోనేషియా దగ్గర లేదు. మళ్ళి అమెరికా సహాయాన్ని అది పొందాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాంతం లోనే విమానం మునిగిందా లేదా అన్నది ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది.

హరికాంత్
airasia flight found in sea, singapore flights, indonesia flight incident, malaysia flight incidents, indonesia to sinagpore flight, disappeared flight found in sea, java ocean, java sea, flight in java sea, air asia flight found in ocean, flight passengers dead bodies found in sea , Air asia flight found in sea official statement has given some dead bodies also collected

Monday, 29 December 2014

Microsoft CEO Meets Narendra Modi


సత్య నాదెళ్ళ ప్రపంచానికే గర్వ కారణమైన సంస్థ మైక్రో సాఫ్ట్ కు సి ఇ ఒ. నిన్న ఆయన భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్ లో క్రిస్మస్ సంబరాలకు వచ్చిన ఆయన ప్రధాన మంత్రి మోడీ తో సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ మోడీ స్వప్నం అయిన డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా లో భాగస్వామ్యం కావాలని ఉందని ఆకాక్షించారు.

Click Here to Know More

Click Here to Know More Political News

TDP MLA's Ready to Join TRS


ఇప్పటికే టిడిపి ఎంఎల్ఏ లు టిఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.. అందులో ఒకరికి మంత్రి పదవి కూడా అధికార ప్రభుత్వం కట్టబెట్టింది. ఇంకొ ఎంఎల్ఏకు మరో ముఖ్య పదవి ఇచ్చే ఆలోచన ఉన్నట్లు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు మళ్ళి ఇంకొందరు ఎం ఎల్ ఏ లు టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు బయట కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ ఎంఎల్ఏ లు కెసిఆర్ నుండి ఏదోక హామీ తీసుకొనే పార్టీ లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారికి ఇప్పటికే కొన్ని తాయిలాలు అందజేస్తామని తెరాస వర్గాలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

Read More Here....

Click Here to Know More Political News

Monday, 22 September 2014

Comparison Between Telangana And Scotland

Comparison between telangana and scotland 

ప్రపంచ ప్రజాస్వామిక దేశాలకు భారత్ ఆదర్శమని మనమంతా గర్వంగా చెప్పుకుంటాము. కాని లోపల జరిగేది మాత్రం ప్రజాస్వామ్య ఖూనీ అనే చెప్పాలి. ఒక్క తెలంగాణ అంశంమే తీసుకుంటే ప్రజాస్వామ్యం ఎంత కుమిలిపోతుందో అర్ధమవుతుంది. గతవారం జరిగిన స్కాట్లాండ్ స్వాతంత్ర్య - సమైక్య పోరు ప్రపంచానికే ఆదర్శంగా నిలిస్తే.., మన దేశంలో జరిగిన కొత్త రాష్ర్ట ఏర్పాటు ఒక చీకటి అధ్యాయానికి తెరతీసింది. విభజనతో సమస్యలు తొలగుతాయి.., ప్రజల మద్య సత్సంబంధాలు పెరుగుతాయనుకుంటే ఈ అగాధం మరింత పెరిగింది. దీనికి కారణం ఎవరు... ఈ తప్పుకు ఎవరిని నిందించాలి.. Read more ...

Click here for Latest News ..


Monday, 18 August 2014

Tdp Minister Achhennayudu Comments Ys Jagan Killed Paritala Ravi



Tdp minister achhennayudu comments ys jagan killed paritala ravi

టీడీపీ నేత పరిటాల రవిని హత్యకు వైఎస్ జగన్ కారణమో లేదో తెలియదు కానీ... టీడీపీ మంత్రి అయిన అచ్చెన్నాయుడు మాత్రం ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. పరిటాల రవిని చంపింది వైఎస్ జగన్ కాదా? అంటూ ఆయన నిలదీశారు. అసెంబ్లీలో శాంతిభ్రదల తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబడిన వైకాపా సభ్యులు... తమ పార్టీలో వున్న నేతల హత్యలకు టీడీపీ పార్టీయే కారణమంటూ విమర్శలు లేవనెత్తిన సందర్భంలో అచ్చెన్నాయుడు మండిపడుతూ అలా ఆరోపించారు.......Read More......



Jagan Says He Dont Have One Lakh Crore Money


Jagan says he dont have one lakh crore money

లక్షకోట్ల అవినీతి. ఈ మాట వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ జగన్ పేరు. ఆయన అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది సీబీఐకి, పైవాడికి తెలియాలి. తండ్రి హయాంలో బ్యాక్ డోర్ పనులు, క్విడ్ ప్రో కో ద్వారా జగన్ లక్ష కోట్లను అక్రమంగా కూడబెట్టాడని తీవ్ర ఆరోపణలున్నాయి. ఇదే కేసులో జగన్ అరెస్టయి ఏడాదికంటే ఎక్కవే జైలు జీవితం గడిపి ఎన్నికల ముందు విడుదలయ్యారు. ఇప్పుడిదే అంశం మళ్ళి తెరపైకి వచ్చింది. అటుపోయి ఇటు పోయి తనకే తగిలినట్లుగా.., అన్నిటిపై విమర్శలు వచ్చి చివరకు లక్ష కోట్ల వ్యవహారం దగ్గర నిలిచింది. దీంతో జగన్ కు కోపం వచ్చింది. అసలు ఎక్కడున్నాయి లక్ష కోట్లు అని ఎదురు ప్రశ్నించారు. Read More......

Kcr Briefs About Meeting With Chandrababu Naidu

 
కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్
 
Kcr briefs about meeting with chandrababu naidu 
 
ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది. దాదాపు గంటన్నర పాటు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముఖా ముఖీ నిర్వహించుకున్నారు. విభజన సమస్యలను కలిసి పంచుకున్నారు. సమావేశం ఎలా జరిగిందో తెలియదు కానీ.., ఫలప్రదంగా ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల కోసం కేంద్రం అసలు ఏ కమిటి నియమించనవసరం లేదన్నారాయన. మనది మనమే పరిష్కరించుకుందాం అని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరష్కరించుకుంటే అభ్యంతరమే లేదని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. కాబట్టి ప్రతి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. తెలుగు రాష్ర్టాలు బాగుండాలన్నదే తన ధ్యేయంగా కేసీఆర్ స్పష్టం చేశారు.
 
Click Here for more Latest Telugu News 
ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది. దాదాపు గంటన్నర పాటు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముఖా ముఖీ నిర్వహించుకున్నారు. విభజన సమస్యలను కలిసి పంచుకున్నారు. సమావేశం ఎలా జరిగిందో తెలియదు కానీ.., ఫలప్రదంగా ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల కోసం కేంద్రం అసలు ఏ కమిటి నియమించనవసరం లేదన్నారాయన. మనది మనమే పరిష్కరించుకుందాం అని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరష్కరించుకుంటే అభ్యంతరమే లేదని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. కాబట్టి ప్రతి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. తెలుగు రాష్ర్టాలు బాగుండాలన్నదే తన ధ్యేయంగా కేసీఆర్ స్పష్టం చేశారు. - See more at: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/55322-kcr-briefs-about-meeting-with-chandrababu-naidu.html#sthash.P2VgDRH4.dpuf